రాష్ట్రస్థాయి కరాటేలో హుజూరాబాద్ పంచ్.. పతకాల పంట!

బాహుబలం న్యూస్
bahubalamtv.in

రాష్ట్రస్థాయి కరాటేలో హుజూరాబాద్ పంచ్.. పతకాల పంట!

09 Aug 2026, 6:53 pm BAHUBALAM NEWS

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 09 :గోదావరిఖనిలోని అమృతా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో హుజూరాబాద్ విద్యార్థులు పతకాల పంట పండించారు. గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు, మాస్టర్ ఎస్.కే. జలీల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఈ క్రీడాకారులు అద్భుత ప్రతిభ చాటారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 400 మంది పోటీపడిన ఈ టోర్నమెంట్‌లో హుజూరాబాద్ విద్యార్థులు వరుస విజయాలతో తమ సత్తా చాటారు.
పతకాలు సాధించిన క్రీడాకారులు
పోటీల్లో సిహెచ్. సాయి చరణ్ (13 ఏళ్లు) కటాస్, స్పారింగ్ విభాగాల్లో రెండు స్వర్ణాలు సాధించగా.. ఎస్.కే. సాదుల్లా బాబా (14 ఏళ్లు) కటాస్‌లో స్వర్ణం, స్పారింగ్‌లో రజతం గెలుపొందారు. అలాగే ఎం. భాను తేజ (15 ఏళ్లు), జున్ను కావ్య (16 ఏళ్లు), పి. సహస్ర (15 ఏళ్లు), పి. కిరణ్మయి (13 ఏళ్లు), జి. నక్షత్ర (12 ఏళ్లు), ఎం.డి. హుమేరా తస్లీమ్ (10 ఏళ్లు), వి. వినూత్న (10 ఏళ్లు), పి. నిస్సి (9 ఏళ్లు), ఎం.డి. సహార (8 ఏళ్లు) స్వర్ణ పతకాలు సాధించారు. 7 సంవత్సరాల విభాగంలో హేమ కటాస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
విజేతలకు ప్రముఖుల అభినందనలు
రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను, మాస్టర్ ఎస్.కే. జలీల్‌ను పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో హుజూరాబాద్ టౌన్ సీఐ కరుణాకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, 17వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలీద్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, ఉప్పు శ్రీనివాస్, న్యూ కాకతీయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, డైరెక్టర్లు గోపాల్, వెంగళరావు, కాంగ్రెస్ నాయకుడు గోస్కుల మధు తదితరులు ఉన్నారు.

Generating image…

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 09 :గోదావరిఖనిలోని అమృతా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో హుజూరాబాద్ విద్యార్థులు పతకాల పంట పండించారు. గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు, మాస్టర్ ఎస్.కే. జలీల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఈ క్రీడాకారులు అద్భుత ప్రతిభ చాటారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 400 మంది పోటీపడిన ఈ టోర్నమెంట్‌లో హుజూరాబాద్ విద్యార్థులు వరుస విజయాలతో తమ సత్తా చాటారు.
పతకాలు సాధించిన క్రీడాకారులు
పోటీల్లో సిహెచ్. సాయి చరణ్ (13 ఏళ్లు) కటాస్, స్పారింగ్ విభాగాల్లో రెండు స్వర్ణాలు సాధించగా.. ఎస్.కే. సాదుల్లా బాబా (14 ఏళ్లు) కటాస్‌లో స్వర్ణం, స్పారింగ్‌లో రజతం గెలుపొందారు. అలాగే ఎం. భాను తేజ (15 ఏళ్లు), జున్ను కావ్య (16 ఏళ్లు), పి. సహస్ర (15 ఏళ్లు), పి. కిరణ్మయి (13 ఏళ్లు), జి. నక్షత్ర (12 ఏళ్లు), ఎం.డి. హుమేరా తస్లీమ్ (10 ఏళ్లు), వి. వినూత్న (10 ఏళ్లు), పి. నిస్సి (9 ఏళ్లు), ఎం.డి. సహార (8 ఏళ్లు) స్వర్ణ పతకాలు సాధించారు. 7 సంవత్సరాల విభాగంలో హేమ కటాస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
విజేతలకు ప్రముఖుల అభినందనలు
రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను, మాస్టర్ ఎస్.కే. జలీల్‌ను పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో హుజూరాబాద్ టౌన్ సీఐ కరుణాకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, 17వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలీద్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, ఉప్పు శ్రీనివాస్, న్యూ కాకతీయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, డైరెక్టర్లు గోపాల్, వెంగళరావు, కాంగ్రెస్ నాయకుడు గోస్కుల మధు తదితరులు ఉన్నారు.

bahubalamtv Reporter
bahubalamtv.in

రాష్ట్రస్థాయి కరాటేలో హుజూరాబాద్ పంచ్.. పతకాల పంట!

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 09 :గోదావరిఖనిలోని అమృతా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో హుజూరాబాద్ విద్యార్థులు పతకాల పంట పండించారు. గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు, మాస్టర్ ఎస్.కే. జలీల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఈ క్రీడాకారులు అద్భుత ప్రతిభ చాటారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 400 మంది పోటీపడిన ఈ టోర్నమెంట్‌లో హుజూరాబాద్ విద్యార్థులు వరుస విజయాలతో తమ సత్తా చాటారు.
పతకాలు సాధించిన క్రీడాకారులు
పోటీల్లో సిహెచ్. సాయి చరణ్ (13 ఏళ్లు) కటాస్, స్పారింగ్ విభాగాల్లో రెండు స్వర్ణాలు సాధించగా.. ఎస్.కే. సాదుల్లా బాబా (14 ఏళ్లు) కటాస్‌లో స్వర్ణం, స్పారింగ్‌లో రజతం గెలుపొందారు. అలాగే ఎం. భాను తేజ (15 ఏళ్లు), జున్ను కావ్య (16 ఏళ్లు), పి. సహస్ర (15 ఏళ్లు), పి. కిరణ్మయి (13 ఏళ్లు), జి. నక్షత్ర (12 ఏళ్లు), ఎం.డి. హుమేరా తస్లీమ్ (10 ఏళ్లు), వి. వినూత్న (10 ఏళ్లు), పి. నిస్సి (9 ఏళ్లు), ఎం.డి. సహార (8 ఏళ్లు) స్వర్ణ పతకాలు సాధించారు. 7 సంవత్సరాల విభాగంలో హేమ కటాస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
విజేతలకు ప్రముఖుల అభినందనలు
రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను, మాస్టర్ ఎస్.కే. జలీల్‌ను పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో హుజూరాబాద్ టౌన్ సీఐ కరుణాకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, 17వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలీద్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, ఉప్పు శ్రీనివాస్, న్యూ కాకతీయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, డైరెక్టర్లు గోపాల్, వెంగళరావు, కాంగ్రెస్ నాయకుడు గోస్కుల మధు తదితరులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !