బాహు బలంన్యూస్ శంకరపట్నం, సెప్టెంబర్ 20: తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గం సుజాత అకాల మృతి పట్ల రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తెలుసుకున్న ఆయన తీవ్ర సంతాపం ప్రకటిస్తూ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. తమ పొరుగు గ్రామమైన తాడికల్ అభివృద్ధి కోసం సుజాత విశేషంగా పాటుపడ్డారని కొనియాడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతులు, మహిళలు, పేదల సమస్యల పరిష్కారానికి ఆమె అహర్నిశలు శ్రమించారని గుర్తుచేసుకున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం తపించే ఒక మంచి ప్రజాప్రతినిధిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Post Views: 237










