బాహు బలంన్యూస్ హుజూరాబాద్:, బాహు బలంన్యూస్ హుజూరాబాద్ మున్సిపాలిటీ 5వ వార్డులో గోరింటాకు వేడుకలు వర్ణశోభితంగా సాగాయి. స్థానిక కౌన్సిలర్ సొల్లు సునీత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్డు మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతికి ప్రతీకైన గోరింటాకు ఎర్రగా పండితే జీవితాలు సంతోషమయమవుతాయని, ఆ నమ్మకంతోనే కులమతాలకు అతీతంగా మహిళలందరినీ ఒకే చోట చేర్చి ఈ వేడుక నిర్వహించినట్లు కౌన్సిలర్ సునీత తెలిపారు. మున్సిపల్ పరిధిలో సోదరభావాన్ని పెంచేలా సాగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
Post Views: 6










