పాలకులు కళ్లు తెరవాలి.. రైతు గర్జన వినాలి!….. కరీంనగర్‌లో 30న సమరభేరి: పోలాడి రామారావు…

బాహు బలంన్యూస్ కరీంనగర్ మే 13;రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని, రైతులను విస్మరిస్తే పాలకులకు పుట్టగతులు ఉండవని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా, ఈ నెల 30న కరీంనగర్ వేదికగా రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ‘రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరి’ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక సభ విజయవంతం కోసం బుధవారం ఆయన కరీంనగర్‌లో విస్తృతంగా పర్యటించి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టారు.

ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నేతలను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేయగా, వారంతా సానుకూలంగా స్పందించి సభకు సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలోనే పలువురు ముఖ్య నాయకులతో కలిసి రామారావు సభకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు.

అడుగడుగునా అన్నదాతకు అన్యాయమే!

అనంతరం పోలాడి రామారావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ కరువైందని, మిల్లర్లు, సిబ్బంది కుమ్మక్కై తేమ పేరుతో క్వింటాల్‌కు 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ చెల్లింపులో వందలాది కొర్రీలు పెట్టి రైతులను ఆవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా యాసంగి ముగిసినా నేటికీ రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

లక్షలాది మందితో కరీంనగర్ కదలాలి

రాజకీయాలకు అతీతంగా కేవలం రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా నిర్వహించే ఈ మహాసభకు సుమారు రెండు లక్షల మంది రైతులు హాజరవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని పంటలకు వెంటనే బోనస్ నిధులు విడుదల చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన నిలిచి చేస్తున్న ఈ పోరాటానికి అందరూ కలిసి రావాలని రామారావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రైతు నాయకులు చందుపట్ల సుధాకర్ రెడ్డి, జువ్వాడి కరుణాకర్ రావు, లింగన్నగారి బాలకిషన్ రావు, ఆకుల కోటి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !