బాహు బలంన్యూస్ హుజూరాబాద్: పసిపిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ బండి శృతి పేర్కొన్నారు. శుక్రవారం హుజూరాబాద్ బ్రహ్మకుమారీస్ కేంద్రంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శృతి మాట్లాడుతూ.. ఫోన్ల వాడకంతో పిల్లల మెదడుపై ప్రభావం పడి, సృజనాత్మకత తగ్గుతుందన్నారు. గర్భిణులు కూడా ఫోన్లకు దూరంగా ఉంటూ పుస్తకాలు చదవడం, సంగీతం వినడం మంచిదని సూచించారు. కేంద్ర ఇన్ఛార్జి బికే శ్రీవాణి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించే ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కందుగుల ప్రభుత్వ పాఠశాల, శ్రీచైతన్య, వివేకవర్ధిని పాఠశాలల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాజయ్య, ఈశ్వరయ్య, నర్సింగం చౌదరి, జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు.










