బాహు బలంన్యూస్ హైదరాబాద్, ఆగస్టు 11:
పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ దంపతులకు పలువురు ప్రముఖుల నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఓసీ జేఏసీ (OC JAC) రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా విభాగం తరఫున వినోద్ కుమార్ దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రభావతి రెడ్డి, వారి దాంపత్య జీవితం ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, సమాజానికి ఆయన అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు, ప్రతినిధులు పాల్గొని మాజీ ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు
Post Views: 49










