బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఆగస్టు 12:
హుజురాబాద్ మండలం చెల్పూరు గ్రామంలో ఎమ్మార్పీఎస్ (MRPS), ఎంఎస్పీ (MSP) నూతన గ్రామ కమిటీలను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల ఇన్చార్జి ఎర్ర ఆదిత్య మాదిగ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు.
ఎమ్మార్పీఎస్ (MRPS) గ్రామ కమిటీ.
అధ్యక్షుడిగా కనకం రాజేందర్ మాదిగ, అధికార ప్రతినిధిగా వేల్పుల వినయ్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా శనిగరం తరుణ్ కుమార్ మాదిగ, కార్యదర్శిగా ఆకునూరి అజయ్ మాదిగ, కోశాధికారిగా అకినపల్లి అక్షయ్ మాదిగలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎంఎస్పీ (MSP) గ్రామ కమిటీ..
అధ్యక్షుడిగా కొంకటి రమేష్ మాదిగ, అధికార ప్రతినిధిగా శనిగరం రాజేందర్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా మొలుగురీ రమేష్ మాదిగ, ఉపాధ్యక్షులుగా ఆకినపల్లి రవి మాదిగ, కనకం రాజేందర్ మాదిగ, కోశాధికారిగా ఆకినపెళ్లి ఆకాష్ మాదిగ, కార్యదర్శిగా పుల్ల అనిల్ మాదిగ, సహాయ కార్యదర్శిగా శనిగరపు నాగులు మాదిగ, కార్యవర్గ సభ్యుడిగా శనిగరపు రాజేందర్ మాదిగలు ఎన్నుకోబడ్డారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ, జాతీయ నాయకుడు రుద్రారపు రామచంద్ర మాదిగ, ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.










