బాహు బలంన్యూస్ జమ్మికుంట, ఆగస్టు 11 :
మండల పరిధిలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన పుల్లూరి మధునమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ పోల్సాని వినోద్ నారాయణరావు పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయాన్ని మంగళవారం సర్పంచ్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, ఆపదలో ఉన్న కుటుంబాలకు గ్రామ పంచాయతీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బోయిని అనిల్, బండారి ప్రశాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 9










