బాహు బలంన్యూస్ సైదాపూర్, మే 9: కరీంనగర్ జిల్లా బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సైదాపూర్ మండలంలో పోలీసులు ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగించారు. బంద్ ప్రభావం మండలంలో కనిపించకుండా ఉండేందుకు శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకున్నారు.
నేతల గృహనిర్బంధం – పోలీస్ స్టేషన్కు తరలింపు.
బంద్ పిలుపుతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సైదాపూర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్యతో పాటు పలువురు కీలక నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు అయిన వారిలో తాటిపల్లి యుగంధర్ రెడ్డి, రేగుల సుమలత అశోక్, పైడిపల్లి రవీందర్, మునిపాల శ్రీనివాస్, వేణు తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ తీరుపై నాయకుల ఆగ్రహం..
తమను అక్రమంగా అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని వారు విమర్శించారు. ఎన్ని అరెస్టులు చేసినా ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మండలంలో ఎక్కడా అశాంతి నెలకొనకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు..











