బాహు బలంన్యూస్, హుజజురాబాద్,:
తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడిగా జూపాక గ్రామానికి చెందిన 4వ వార్డు సభ్యుడు గురుకుంట్ల రాజు నియమితులయ్యారు. ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు నాగవల్లి జ్యోతి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బండారి భరత్ ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ సందర్భంగా గురుకుంట్ల రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వార్డు సభ్యుల హక్కులు, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.
గురుకుంట్ల రాజు నియామకం పట్ల జూపాక గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి స్వప్న-వెంకటేష్, ఉపసర్పంచ్ గిన్నారపు మహేందర్, వార్డు సభ్యుడు ఇల్లందుల వెంకటేష్, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.










