బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఆగస్టు 6:
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను హుజురాబాద్లో మనుమయ సంఘం ఆధ్వర్యంలో గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మనుమయ సంఘం అధ్యక్షుడు నందగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలు, చూపిన బాట చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని, సార్ ఆశయ సాధనకు నిరంతరం కృషి చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మనుమయ సంఘం నాయకులు, ప్రతినిధులు తాటికొండ శ్రీనివాస్, రాంపల్లి బిక్షపతి, బాణాల వివేకానంద, రావుల సురేందర్, బాణాల సత్యనారాయణ, రాజకుమార్, నరసింహ చారి, లింగమూర్తి, మల్లాచారి, రాజేష్ మరియు మనుమయ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు










