బాహు బలంన్యూస్,హుజూరాబాద్ ఆగస్టు 06:
తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను హుజూరాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా వద్దగల అమరవీరుల స్థూపం వద్ద మహాత్మ జ్యోతిబా పూలే కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు, సభ్యులు జయశంకర్ సార్ చిత్రపటానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిబా పూలే కమిటీ అధ్యక్షుడు చల్లూరి రఘుచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. హుజూరాబాద్ పట్టణంలో ఆయన జ్ఞాపకార్థం జయశంకర్ సార్ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిబా పూలే కమిటీ, బిసి జేఏసీ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు
Post Views: 2










