బాహు బలంన్యూస్,హుజురాబాద్,/కేశపట్నం ఆగస్టు 07;; తెలంగాణ జన సమితి (టిజెఎస్) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మోరె గణేష్, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొలంగూర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూములు మరియు చారిత్రాత్మక మొలంగూర్ ఖిల్లాకు సంబంధించిన పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించాలి..
మొలంగూర్ గ్రామంలోని ప్రభుత్వ భూములను సర్వే చేసి, గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల స్థలాలను కేటాయించాలని మోరె గణేష్ విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.
మొలంగూర్ ఖిల్లా పరిరక్షణ – పర్యాటక అభివృద్ధి..
ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన మొలంగూర్ ఖిల్లాను కబ్జాదారుల మరియు భూ అక్రమార్కుల నుండి వెంటనే కాపాడాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ ఖిల్లాను ప్రభుత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిస్తే, ఇది జిల్లాలోనే అతిపెద్ద పర్యాటక సందర్శక ప్రాంతంగా మారుతుందని వివరించారు. ఖిల్లా ప్రాముఖ్యతను, దాని పూర్తి చారిత్రక వివరాలను పిసిసి అధ్యక్షుడికి అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిజెఎస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.











