డాక్టర్‌ నాగుల సత్యం గౌడ్‌కు జాతీయస్థాయి ‘ఆధ్యాత్మిక విజ్ఞాన జ్యోతి’ పురస్కార ప్రధానం.

బాహు బలంన్యూస్ కరీంనగర్ మార్చి 29 :
ప్రముఖ తత్వవేత్త, ఆధ్యాత్మిక విశ్వగురువు, ప్రజాకవి బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కు జాతీయస్థాయి ‘ఆధ్యాత్మిక విజ్ఞాన జ్యోతి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని ఫిలిం భవన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షుడిగా, అంతర్జాతీయ స్థాయి వరల్డ్ రికార్డ్ గ్రహీతగా సత్యం గౌడ్ సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ వ్యవస్థాపకులు పోలోజు రాజకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఘనంగా సన్మానం
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన విశ్వ కళా విరాట్ డాక్టర్ వంగల శాంతి కృష్ణచార్య, ప్రముఖ హాస్య నటులు ఆర్.ఎస్. నంద, సామాజికవేత్త మల్లికార్జున్, న్యాయవాది ఏ. కిరణ్ కుమార్, ‘కరీంనగర్ భూమి’ ఎడిటర్ బిడ్డల ప్రశాంత్ తదితరులు సత్యం గౌడ్‌కు పట్టుశాలువా కప్పి, మెడల్ ధరింపజేసి, ఉగాది జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సత్యం గౌడ్ అపారమైన జ్ఞానం కలిగిన దైవాంశ సంభూతులని, ఆయన ప్రసంగాలు సమాజానికి వెలకట్టలేని విలువలని ప్రశంసించారు. వెలకట్టలేని మానవత్వాన్ని కాపాడుతూ, సమాజానికి ఆయన అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.
యువతకు సందేశం
పురస్కార గ్రహీత డాక్టర్ నాగుల సత్యం గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మనసును అదుపులో ఉంచుకొని, నిర్మలంగా మార్చుకొని ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు. దేశానికి మూలస్తంభాలైన నేటి యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి నవ సమాజ నిర్మాణానికి పునాదిగా నిలవాలని పిలుపునిచ్చారు. మనుషులు ఒకరికొకరు నష్టం చేసుకోకుండా, సహకరించుకునే దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో లోక కల్యాణంలో భాగస్వాములు కావాలని కోరారు. కళాకారులను, కవులను నిరంతరం ప్రోత్సహిస్తున్న పోలోజు రాజకుమార్ సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు వలబోజు మోహన్ రావు, పాడిశెట్టి విష్ణువర్ధన్, అడ్డంకి నాగరాజు, సకల కళా రత్న అక్కనపల్లి యాదగిరి గౌడ్, కవి వైరాగ్యం ప్రభాకర్, రాధికతో పాటు పలువురు కళాకారులు, టీవీ నటులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..