21వ వార్డు సమగ్ర అభివృద్ధికి కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయండి: బిజెపి అభ్యర్థి పంజాల మనోజ్ కుమార్ పిలుపు.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఫిబ్రవరి 10:21వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పంజాల మనోజ్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంగళవారం వార్డులోని వివిధ బస్తీల్లో పర్యటించిన ఆయనకు మహిళలు, యువత ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు ప్రజల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని, ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. మార్పు దిశగా అడుగులు వేయాలని, కమలం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు.
తన ఎన్నికల ప్రణాళికలో భాగంగా మనోజ్ కుమార్ పలు కీలక హామీలను ప్రకటించారు. ఆడబిడ్డల వివాహాలకు రూ. 10,116 మేర నగదు ప్రోత్సాహకం అందించడంతో పాటు, నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు వార్డులోనే ‘జాబ్ మేళా’లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఆరు నెలలకోసారి ఉచిత వైద్య శిబిరాలు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, వీధి వీధినా సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా భద్రతను పటిష్టం చేస్తానని హామీ ఇచ్చారు. పారిశుధ్య కార్మికుల సమన్వయంతో వార్డును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతూ, కాలుష్య రహిత వాతావరణాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. అవినీతి లేని పాలన కోసం, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..