హుజూరాబాద్‌లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు: నివాళులర్పించిన ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఫిబ్రవరి 19: భారత గడ్డపై స్వరాజ్య కాంక్షను రగిల్చి, మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వీర శిఖరం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు హుజూరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. స్థానిక శివాజీ కాలనీలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ ముఖ్య అతిథిగా పాల్గొని, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం శివాజీ మహారాజ్ చేసిన పోరాటాలు అద్వితీయమని, ఆయన చూపిన బాటలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు, ప్రజా రంజక పాలనకు శివాజీ మారుపేరుగా నిలిచారని కొనియాడారు.
​ఈ జయంతోత్సవ కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్న, రంగాపూర్ వార్డ్ మెంబర్ గుడ్ల బాబ్జి, గుడ్ల శ్యామలరావు, గుండారపు చంద్రశేఖర్, వన్నాల నేతాజీ, వన్నాల భీష్మాజి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శివాజీ మహారాజ్ ఆశయాలను స్మరిస్తూ కాలనీ ప్రజలు, నాయకులు ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !