అభివృద్ధి చేస్తా ఆశీర్వదించండి: ఏడవ వార్డులో అందాసి నారాయణ ప్రభంజనం

హుజూరాబాద్, ఫిబ్రవరి 9 (బాహుబలం న్యూస్): హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల వేళ పట్టణంలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది. ఏడవ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న అందాసి నారాయణ చేపట్టిన ఎన్నికల ప్రచారం ప్రస్తుతం ఒక ప్రభంజనంలా దూసుకుపోతోంది. ప్రచారంలో భాగంగా ఆయన వార్డులోని ప్రతి గల్లీని చుడుతూ, ప్రతి ఇంటి తలుపు తడుతూ ఓటర్లతో నేరుగా మమేకమవుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో వార్డులో మార్పు గాలి బలంగా వీస్తోంది. అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా సేవకుడిగా మీ ముందుకు వస్తున్నానని ఆయన చెబుతుంటే, ఓటర్లు ప్రతిచోటా బ్రహ్మరథం పడుతున్నారు.
“నేను నిలబడింది అధికారం కోసం కాదు – కేవలం మన వార్డు అభివృద్ధి కోసమే” అని అందాసి నారాయణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. యువత మరియు పెద్దల సహకారంతో ఏడవ వార్డును రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ‘క్లీన్ అండ్ గ్రీన్’ వార్డుగా మారుస్తానని ఆయన ఘనంగా హామీ ఇచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారంలో గత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ, సమర్థవంతమైన పాలన కోసం తన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం తనపై పుష్కలంగా ఉన్నాయని, రాబోయే ఫలితాల్లో తన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఫిబ్రవరి 11న జరగబోయే పోలింగ్‌లో ఓటర్లు భారీ ఎత్తున తరలివచ్చి, కత్తెర గుర్తుపై ముద్ర వేసి తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో మరింత వేగం పెంచిన ఆయన, వార్డు అభివృద్ధికి కొత్త విజన్‌తో ముందుకు సాగుతూ ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !