24వ వార్డు అభివృద్ధి నా ధ్యేయం: ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి నాంపెళ్లి శ్రీనివాస్.

బాహు బలంన్యూస్ హుజురాబాద్,ఫిబ్రవరి 09:పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాంపెళ్లి శ్రీనివాస్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వార్డులోని ప్రతి గల్లీని చుడుతూ, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ భారీ మద్దతును కూడగట్టుకుంటున్నారు. ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వార్డు రూపురేఖలు మార్చడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గెలిచిన ఏడాది కాలంలోనే వార్డులో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా బాయలకాడికి వెళ్లే రాగట్లో నూతన రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు, హనుమాన్ టెంపుల్ సమీపంలో ప్రజల నీటి అవసరాల కోసం ప్రత్యేక వాటర్ ట్యాంక్‌ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. అలాగే హనుమాన్ టెంపుల్ పరిసర ప్రాంతాలతో పాటు, పద్మశాలీ కాలనీలో పూర్తిస్థాయిలో సిసి రోడ్ల నిర్మాణం చేపడతానని, ముదిరాజ్ సామాజిక వర్గానికి అవసరమైన పంపు సెట్ల పంపిణీ వంటి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని పేర్కొన్నారు.
తాను అధికార పార్టీలో ఉన్నందున నిధుల కొరత లేకుండా చూస్తానని, మీ ఇంట్లో పెద్ద కొడుకులా ఉండి ప్రతి సమస్యను తీరుస్తానని ఆయన ప్రజలకు విన్నవించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు, మరియు జిల్లా ఇంచార్జ్ తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో వార్డు అభివృద్ధికి భారీగా నిధులు తీసుకువస్తానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. శ్రీనివాస్ ప్రచారానికి వార్డు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువత ఆయనకు బ్రహ్మరథం పడుతుండటంతో 24వ వార్డులో కాంగ్రెస్ ప్రచారం హోరెత్తుతోంది. అభివృద్ధి చేసే వ్యక్తికే తమ ఓటు అని వార్డు వాసులు స్పష్టం చేస్తుండటంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..