బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఫిబ్రవరి 08: హుజూరాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న బోరగాళ్ల సురేష్ తన ఎన్నికల ప్రచారంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్నారు. “ప్రజలే నా పార్టీ, పార్టీలు మారుతాయి కానీ ప్రజలు శాశ్వతం” అనే బలమైన నినాదంతో ఆయన వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల ఆశీస్సులు పొందుతున్నారు. సామాన్యుడి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన ఓటర్లకు భరోసా ఇస్తున్నారు.
ప్రస్తుతం ఆయనకు కేటాయించిన ‘ఎయిర్ కండీషనర్’ (ఏసీ) గుర్తు ప్రచారంలో మారుమోగిపోతోంది. సీరియల్ నంబర్ 4 వద్ద ఉన్న తన గుర్తుపై ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. వార్డులో సురక్షితమైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల మరియు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.ఫిబ్రవరి 11,నాడు జరగనున్న పోలింగ్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ప్రజల నుండి లభిస్తున్న విశేష స్పందన చూస్తుంటే, ఈసారి 6వ వార్డులో సురేష్ విజయం ఖాయమని ఆయన మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవ చేసే గుణం ఉన్న బోరగాళ్ల సురేష్ను గెలిపించుకోవడం ద్వారానే వార్డు సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్థానికులు చర్చించుకుంటున్నారు.












