బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఫిబ్రవరి 07:
హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల వేళ 16వ వార్డులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి బోడిగే రాధ తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆమె సాగిస్తున్న పాదయాత్రకు ఓటర్ల నుండి విశేష స్పందన లభిస్తోంది. మహిళలు, యువత పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు తెలుపుతుండటంతో 16వ వార్డులో బీజేపీ విజయం ఖాయమనే ధీమా వ్యక్తమవుతోంది.
బోడిగే రాధ గారి ప్రచార జోరుకు తోడు, అదే వార్డులో బిఆర్ఎస్ (BRS) పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక కార్యకర్తలు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, అభ్యర్థి విజయానికి తోడ్పడతామని ప్రకటించి బీజేపీలో చేరారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో అజయ్ కేశవేణి, ఉస్మాన్ పాషా, టిప్పు సుల్తాన్, ప్రణయ్ శెట్టి, శ్రావణ్ వేమూరి, గోశిక ప్రభాకర్, మలుగురి నరేష్, నిఖిల్ గోశిక, ప్రశాంత్ ఆరవెల్లి, అరుణ గోశిక, సునీత తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ.. అభ్యర్థి బోడిగే రాధ గారి గెలుపు కోసం కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో లభిస్తున్న ప్రజాదరణ చూస్తుంటే 16వ వార్డులో కమలం వికసించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.












