పట్టణ కమిటీ అధ్యక్షులు రామగిరి అంకుష్ ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జనవరి 18: తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి వేడుకలను హుజురాబాద్ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కమిటీ అధ్యక్షులు రామగిరి అంకుష్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రామగిరి అంకుష్ మాట్లాడుతూ.. పేదల పెన్నిధిగా, ఆత్మగౌరవ ప్రదాతగా ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం బస్టాండ్‌లో వేచి ఉన్న ప్రయాణికులకు పండ్లను పంపిణీ చేసి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షులు ఎస్కే ఫయాజ్, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రతాపరాజు, పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి శివ కోటేశ్వరరావు,ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ అబాల శంకర్, బీసీ పట్టణ ప్రెసిడెంట్ కాముని రాజేశం, పట్టణ ఉపాధ్యక్షులు ఆడేపు రవీందర్, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి శడమాకి బిక్షపతి,ఎస్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ గుణశేఖర్ ,గ్రామ కమిటీ అధ్యక్షులు పూదరి రమేష్, టౌన్ మాజీ ఉపాధ్యక్షులు మాడిశెట్టి అశోక్, వికలాంగుల విభాగం మాజీ అధ్యక్షుడు పంజాల శివ, నాయకులు శ్రీపాద ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….