అర్హులకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లివ్వాలి… హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో కేటాయింపులపై బీజేపీ ఆగ్రహం .అక్రమాలపై పోరాడతామని గంగాడి కృష్ణారెడ్డి వెల్లడి..

బాహుబలం న్యూస్
bahubalamtv.in

అర్హులకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లివ్వాలి… హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో కేటాయింపులపై బీజేపీ ఆగ్రహం .అక్రమాలపై పోరాడతామని గంగాడి కృష్ణారెడ్డి వెల్లడి..

05 Aug 2026, 8:16 pm BAHUBALAM NEWS

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,: హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. నిజమైన నిరుపేదలను పక్కనబెట్టి, కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న అనర్హులకు ఇళ్లను కట్టబెట్టారని మండిపడ్డారు. బుధవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఫ్లోర్, కౌన్సిలర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మున్సిపల్ పాలన అవినీతికి అడ్డాగా మారిందని దుయ్యబట్టారు. అర్హులైన పేదల హక్కులను కాలరాస్తున్న అధికారుల తీరుపై బీజేపీ చూస్తూ ఊరుకోదని, బాధితులకు న్యాయం జరిగే వరకు పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ కనుమల విజయ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు, కౌన్సిలర్లు కొలుగురి సుమలత, దామెర అనూష, పంజాల మనోజ్, కొండ ప్రశాంతి, మంచికట్ల మురళి, దామెర అనురాగ్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు

Generating image…

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,: హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. నిజమైన నిరుపేదలను పక్కనబెట్టి, కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న అనర్హులకు ఇళ్లను కట్టబెట్టారని మండిపడ్డారు. బుధవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఫ్లోర్, కౌన్సిలర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మున్సిపల్ పాలన అవినీతికి అడ్డాగా మారిందని దుయ్యబట్టారు. అర్హులైన పేదల హక్కులను కాలరాస్తున్న అధికారుల తీరుపై బీజేపీ చూస్తూ ఊరుకోదని, బాధితులకు న్యాయం జరిగే వరకు పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ కనుమల విజయ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు, కౌన్సిలర్లు కొలుగురి సుమలత, దామెర అనూష, పంజాల మనోజ్, కొండ ప్రశాంతి, మంచికట్ల మురళి, దామెర అనురాగ్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు

bahubalamtv Reporter
bahubalamtv.in

అర్హులకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లివ్వాలి… హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో కేటాయింపులపై బీజేపీ ఆగ్రహం .అక్రమాలపై పోరాడతామని గంగాడి కృష్ణారెడ్డి వెల్లడి..

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,: హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. నిజమైన నిరుపేదలను పక్కనబెట్టి, కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న అనర్హులకు ఇళ్లను కట్టబెట్టారని మండిపడ్డారు. బుధవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఫ్లోర్, కౌన్సిలర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మున్సిపల్ పాలన అవినీతికి అడ్డాగా మారిందని దుయ్యబట్టారు. అర్హులైన పేదల హక్కులను కాలరాస్తున్న అధికారుల తీరుపై బీజేపీ చూస్తూ ఊరుకోదని, బాధితులకు న్యాయం జరిగే వరకు పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ కనుమల విజయ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు, కౌన్సిలర్లు కొలుగురి సుమలత, దామెర అనూష, పంజాల మనోజ్, కొండ ప్రశాంతి, మంచికట్ల మురళి, దామెర అనురాగ్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !