హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ: సేవా గుణాన్ని చాటుకున్న వన్నాల శివాజీ..

బాహు బలంన్యూస్ ​హుజురాబాద్ జనవరి 14: నిరుపేదలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాయం చేయడం అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. బుధవారం హుజరాబాద్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మరియు జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గర్వకారణమని, వన్నాల శివాజీ సామాజిక దృక్పథంతో ముందుకు సాగడం అభినందనీయమని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హుజరాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్న పాల్గొని మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో వన్నాల శివాజీ ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగాపూర్ ఉప సర్పంచ్ బండి నరేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, వడ్లకొండ కిరణ్, గండికోట సంపత్, శేఖర్, ఎండి బాబర్ మరియు ఆసుపత్రి సిబ్బంది, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రోగులకు పండ్లు పంపిణీ చేయడమే కాకుండా, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శివాజీ బృందాన్ని స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !