కాట్రపల్లి అభివృద్ధిపై సామాజిక తనిఖీ: సమస్యల పరిష్కారానికి గ్రామ సభ తీర్మానం

హుజూరాబాద్ (బాహుబలం న్యూస్) జనవరి 08: మండల పరిధిలోని కాట్రపల్లి గ్రామంలో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ పెరుమాండ్ల హైమా బిక్షపతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్ పాల్గొని గ్రామ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన సమస్యలైన వీధి దీపాలు, డ్రైనేజీ, తాగునీరు మరియు పారిశుద్ధ్యంపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు.

గ్రామంలోని మురుగు కాలువలు పూడికతో నిండిపోయి పారిశుద్ధ్యం క్షీణించిందని, దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వీధి దీపాలు వెలగని చోట కొత్త బల్బులు ఏర్పాటు చేయాలని కోరారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పైపులైన్ల మరమ్మతులు చేపట్టాలని సభలో చర్చించారు. అంగన్‌వాడీ టీచర్లు మరియు సీఏలు (CA) తమ పరిధిలో ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై అంగన్‌వాడీ టీచర్లు విన్నవించారు.

ఈ సందర్భంగా కార్యదర్శి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ సభలో వెల్లడైన సమస్యలను రికార్డు చేశామని, నిధుల లభ్యతను బట్టి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులు, సీఏలు గ్రామాభివృద్ధిలో చురుగ్గా పాల్గొని పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, అంగన్‌వాడీ టీచర్లు, డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు, సీఏలు, వార్డు సభ్యులు మరియు కాట్రపల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..