కాట్రపల్లి అభివృద్ధిపై సామాజిక తనిఖీ: సమస్యల పరిష్కారానికి గ్రామ సభ తీర్మానం

బాహుబలం న్యూస్
bahubalamtv.in

కాట్రపల్లి అభివృద్ధిపై సామాజిక తనిఖీ: సమస్యల పరిష్కారానికి గ్రామ సభ తీర్మానం

08 Jan 2026, 6:47 pm BAHUBALAM NEWS

హుజూరాబాద్ (బాహుబలం న్యూస్) జనవరి 08: మండల పరిధిలోని కాట్రపల్లి గ్రామంలో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ పెరుమాండ్ల హైమా బిక్షపతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్ పాల్గొని గ్రామ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన సమస్యలైన వీధి దీపాలు, డ్రైనేజీ, తాగునీరు మరియు పారిశుద్ధ్యంపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు.

గ్రామంలోని మురుగు కాలువలు పూడికతో నిండిపోయి పారిశుద్ధ్యం క్షీణించిందని, దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వీధి దీపాలు వెలగని చోట కొత్త బల్బులు ఏర్పాటు చేయాలని కోరారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పైపులైన్ల మరమ్మతులు చేపట్టాలని సభలో చర్చించారు. అంగన్‌వాడీ టీచర్లు మరియు సీఏలు (CA) తమ పరిధిలో ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై అంగన్‌వాడీ టీచర్లు విన్నవించారు.

ఈ సందర్భంగా కార్యదర్శి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ సభలో వెల్లడైన సమస్యలను రికార్డు చేశామని, నిధుల లభ్యతను బట్టి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులు, సీఏలు గ్రామాభివృద్ధిలో చురుగ్గా పాల్గొని పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, అంగన్‌వాడీ టీచర్లు, డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు, సీఏలు, వార్డు సభ్యులు మరియు కాట్రపల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

హుజూరాబాద్ (బాహుబలం న్యూస్) జనవరి 08: మండల పరిధిలోని కాట్రపల్లి గ్రామంలో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ పెరుమాండ్ల హైమా బిక్షపతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్ పాల్గొని గ్రామ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన సమస్యలైన వీధి దీపాలు, డ్రైనేజీ, తాగునీరు మరియు పారిశుద్ధ్యంపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు.

గ్రామంలోని మురుగు కాలువలు పూడికతో నిండిపోయి పారిశుద్ధ్యం క్షీణించిందని, దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వీధి దీపాలు వెలగని చోట కొత్త బల్బులు ఏర్పాటు చేయాలని కోరారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పైపులైన్ల మరమ్మతులు చేపట్టాలని సభలో చర్చించారు. అంగన్‌వాడీ టీచర్లు మరియు సీఏలు (CA) తమ పరిధిలో ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై అంగన్‌వాడీ టీచర్లు విన్నవించారు.

ఈ సందర్భంగా కార్యదర్శి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ సభలో వెల్లడైన సమస్యలను రికార్డు చేశామని, నిధుల లభ్యతను బట్టి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులు, సీఏలు గ్రామాభివృద్ధిలో చురుగ్గా పాల్గొని పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, అంగన్‌వాడీ టీచర్లు, డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు, సీఏలు, వార్డు సభ్యులు మరియు కాట్రపల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

bahubalamtv Reporter
bahubalamtv.in

కాట్రపల్లి అభివృద్ధిపై సామాజిక తనిఖీ: సమస్యల పరిష్కారానికి గ్రామ సభ తీర్మానం

హుజూరాబాద్ (బాహుబలం న్యూస్) జనవరి 08: మండల పరిధిలోని కాట్రపల్లి గ్రామంలో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ పెరుమాండ్ల హైమా బిక్షపతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్ పాల్గొని గ్రామ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన సమస్యలైన వీధి దీపాలు, డ్రైనేజీ, తాగునీరు మరియు పారిశుద్ధ్యంపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు.

గ్రామంలోని మురుగు కాలువలు పూడికతో నిండిపోయి పారిశుద్ధ్యం క్షీణించిందని, దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వీధి దీపాలు వెలగని చోట కొత్త బల్బులు ఏర్పాటు చేయాలని కోరారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పైపులైన్ల మరమ్మతులు చేపట్టాలని సభలో చర్చించారు. అంగన్‌వాడీ టీచర్లు మరియు సీఏలు (CA) తమ పరిధిలో ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై అంగన్‌వాడీ టీచర్లు విన్నవించారు.

ఈ సందర్భంగా కార్యదర్శి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ సభలో వెల్లడైన సమస్యలను రికార్డు చేశామని, నిధుల లభ్యతను బట్టి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులు, సీఏలు గ్రామాభివృద్ధిలో చురుగ్గా పాల్గొని పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, అంగన్‌వాడీ టీచర్లు, డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు, సీఏలు, వార్డు సభ్యులు మరియు కాట్రపల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !