జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేల్పుల రత్నంకు ఘన సన్మానం

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూలై 13:: తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ నాయకత్వంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గెజిటెడ్ రిటైర్డ్ హెడ్మాస్టర్, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకుడు వేల్పుల రత్నంకు ఘన సన్మానం జరిగింది.
ఈ సన్మాన కార్యక్రమంలో జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి జయపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఉమ్మడి దయాకర్, రిటైర్డ్ ఎంఈఓ గొట్టే జమదగ్ని, పంజాల రవీందర్ గౌడ్, భువనచంద్ర, శ్రీధర్, విజయ్, ఆవునూరి కొమురయ్య, ఆడెపు శ్రీనివాస్, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సమాజానికి వేల్పుల రత్నం చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన నిస్వార్థ సేవకు గుర్తుగా ఈ సన్మానం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !