_బిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి_ కౌశిక్ రెడ్డి పై మాల కులస్తులు ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ పార్టీని దూషించడం ఏమిటి. బిఆర్ఎస్ నాయకులు నిజా నిజాలు ఏమిటో తెలుసుకొని మాట్లాడాలి. హుజురాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ మిడిదొడ్డి రాజు .

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూలై 10;బిఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే సహించేది ఉండదని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ మిడిదొడ్డి రాజు అన్నారు. మాల కులస్తుల ఆరాధ్యుడు మాల కన్నమదాసును అవమానించిన పాడి కౌశిక్ రెడ్డి పై మాల కులస్తులు హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ బిఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైనది కాదని పేర్కొన్నారు. అసత్యాలను ప్రచారం చేయడంలో బిఆర్ఎస్ నాయకులు ముందుంటారని తెలపడానికి ఈ సంఘటన ఉదాహరణ అని తెలిపారు. మాల కులస్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా మాల, మాదిగల మధ్య అల్లర్లు సృష్టించడానికి పాడి కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తూ బిఆర్ఎస్ లో ఉన్నటువంటి మా మాదిగ నాయకులతో మాలకులస్తులపై దుర్భాషలాడించడం ఏమిటని మిడిదొడ్డి రాజు ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి కి రాజకీయంగా ఎలాంటి ఆపద వచ్చినా మా మాదిగ నాయకులను, సోదరులను వాడుకోవడం అలవాటైపోయిందని, మరోసారి కాంగ్రెస్ పార్టీపై అబద్ధాలు ప్రచారం చేస్తూ దుర్భాషలాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !