బాహు బలంన్యూస్ కమలాపూర్, జులై 6 : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కమలాపూర్ మండలం ఉప్పల్ మేజర్ గ్రామపంచాయతీలోశని వారం రోజు కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
శివసత్తుల పూనకాలు, బీరప్ప వారసుల డోలు సప్పుళ్లు, ఊరంతా హోరెత్తిన వాయిద్యాల మధ్య ఈ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. బోనమెత్తిన కురుమ సోదరీమణులు భక్తిశ్రద్ధలతో ఉత్సవంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి, తీన్మార్ మల్లన్న టీం ఇన్ఛార్జి, హనుమకొండ ఆర్టీఐ సాధన కమిటీ సెక్రటరీ కొంగంటి రాజుకుమార్ కురుమ ప్రత్యేకంగా హాజరయ్యారు. కుమారస్వామి, హర్షవర్ధన్, నాగరాజు, శివరాం, రాము, శివకుమార్, శివ, మనివర్ధన్, వంశీ, మహేష్, కార్తీక్, కుల సంఘ పెద్దలు, ఆడబిడ్డలు, సోదర సోదరీమణులు, ఉప్పల్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బీరప్ప బోనాలను విజయవంతం చేశారు.










