ఉప్పల్‌లో ఘనంగా బీరప్ప బోనాలు. హాజరైన తీన్మార్ మల్లన్న టీం నియోజకవర్గ ఇన్‌ఛార్జి,ఆర్టీఐ సాధన కమిటీ సెక్రటరీ కొంగంటి రాజుకుమార్ .

బాహు బలంన్యూస్ కమలాపూర్, జులై 6 : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కమలాపూర్ మండలం ఉప్పల్ మేజర్ గ్రామపంచాయతీలోశని వారం రోజు కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
శివసత్తుల పూనకాలు, బీరప్ప వారసుల డోలు సప్పుళ్లు, ఊరంతా హోరెత్తిన వాయిద్యాల మధ్య ఈ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. బోనమెత్తిన కురుమ సోదరీమణులు భక్తిశ్రద్ధలతో ఉత్సవంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, తీన్మార్ మల్లన్న టీం ఇన్‌ఛార్జి, హనుమకొండ ఆర్టీఐ సాధన కమిటీ సెక్రటరీ కొంగంటి రాజుకుమార్ కురుమ ప్రత్యేకంగా హాజరయ్యారు. కుమారస్వామి, హర్షవర్ధన్, నాగరాజు, శివరాం, రాము, శివకుమార్, శివ, మనివర్ధన్, వంశీ, మహేష్, కార్తీక్, కుల సంఘ పెద్దలు, ఆడబిడ్డలు, సోదర సోదరీమణులు, ఉప్పల్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బీరప్ప బోనాలను విజయవంతం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !