హనుమకొండ జిల్లా అర్ టి ఐ సాధన కమిటీ కార్యదర్శిగా కొంగంటి రాజ్ కుమార్ నియామకం.

బాహు బలంన్యూస్ హనుమకొండ ప్రతినిధి,జూన్ 3: హనుమకొండ జిల్లా సమాచార హక్కు చట్టం అర్ టి ఐ సాధన కమిటీ కార్యదర్శిగా కొంగంటి రాజ్ కుమార్ నియమితులయ్యారు. కమిటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఈ కమిటీ ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులకు లభించాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలను పొందడంలో సహాయపడటా నికి కృషి చేస్తుంది. ముఖ్యంగా, శక్తివంతమైన మరియు అణగారిన వర్గాలకు చెందిన ప్రజల గృహ, కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో మరియు వారి సంక్షేమానికి ఈ కమిటీ కట్టుబడి ఉంటుంది.
ఈ సందర్భంగా, కమిటీ విధానాలను బలోపేతం చేయడంలో మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో తన పూర్తి సేవలను అందిస్తానని రాజ్ కుమార్ తెలిపారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ గారికి, సురా స్రవంతి రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !