బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి జూన్ 03: జమ్మికుంట మండలం, గండ్రపల్లె గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, గండ్రపల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షులు గాదె ప్రభాకర్ పటేల్ ఈరోజు హుజురాబాద్కి ఇటీవల బదిలీపై వచ్చి ఏసీపీగా నూతన బాధ్యతలు స్వీకరించిన మాధవి మేడంని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ పటేల్ మాట్లాడుతూ, హుజురాబాద్ సిఐగా బాధ్యతలు చేపట్టి ప్రజల మన్ననలు పొంది, అదే హుజురాబాద్కి పదోన్నతి ద్వారా ఏసీపీగా రావడం, బాధ్యతలు స్వీకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవికి విద్యాసామగ్రిగా పెన్నులు, పెన్సిళ్లు, నోట్బుక్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభాకర్ పటేల్ మిత్ర బృందం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 42










