బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 13 : ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం హుజూరాబాద్ డివిజన్ ఇన్చార్జిగా గడ్డం విశాల్ నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
సంఘ నాయకుల సమక్షంలో నియామకం
ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల ఓదెలు ఆధ్వర్యంలో, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వంతడుపుల బాబు ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టారు. డివిజన్ పరిధిలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
నాయకులకు కృతజ్ఞతలు
తన నియామకానికి సహకరించిన హుజూరాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్న, అంబేద్కర్ – పూలేవాది డివిజన్ కన్వీనర్ రామగిరి అంకుష్, మండల కన్వీనర్ రామ్ సారయ్య మరియు డివిజన్ కన్వీనర్ అంబాల కుమారస్వామిలకు గడ్డం విశాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్లోని అంబేద్కర్ వాదులు, యువతను ఏకం చేస్తూ సంఘ అభివృద్ధికై నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు.











