హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. .

bahubalamtv Reporter
bahubalamtv.in

హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. .

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 13:
హమాలి కార్మికులకు ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ కదిరే రమేష్ డిమాండ్ చేశారు. ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో గురువారం హుజూరాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల హామీ ప్రకారం హమాలి బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కార్మికులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని, 55 ఏళ్లు దాటిన వారికి ₹6,000 పింఛను ఇవ్వాలని కోరారు. అలాగే ఇళ్లు లేనివారికి 120 గజాల స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి ₹25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం నాయకులు సారయ్య, శంకర్, వెంకటేష్, మహేష్, లింగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 13:
హమాలి కార్మికులకు ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ కదిరే రమేష్ డిమాండ్ చేశారు. ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో గురువారం హుజూరాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల హామీ ప్రకారం హమాలి బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కార్మికులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని, 55 ఏళ్లు దాటిన వారికి ₹6,000 పింఛను ఇవ్వాలని కోరారు. అలాగే ఇళ్లు లేనివారికి 120 గజాల స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి ₹25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం నాయకులు సారయ్య, శంకర్, వెంకటేష్, మహేష్, లింగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !