ప్రజా సంక్షేమానికి స్వచ్ఛంద సంస్థలు వారధి: ఏసీపీ మాధవి

బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 30: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు పూర్తిగా చేరాలంటే అధికార యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థల (NGOs) పాత్ర ఎంతో కీలకమని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
శుక్రవారం, హుజురాబాద్‌కు నూతనంగా వచ్చిన ఏసీపీ మాధవిని పీవీ సేవా సమితి ప్రతినిధులు, సిద్ధార్థ్ నగర్ సొసైటీ అధ్యక్షులు సాగి వీరభద్ర రావు ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఏసీపీ మాధవిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో పీవీ సేవా సమితి, సిద్ధార్థ్ నగర్ అధ్యక్షులు తూము వెంకట రెడ్డి, సాగి వీరభద్ర రావు, బి. మనోజ్, విశ్రాంత పీడీ రాజి రెడ్డి, మురికి గౌరీశంకర్, సీడ్స్ సంపత్ రావు, బిల్డర్ శ్రీనివాస్ రావు, ముక్కెర కన్నయ్య, దొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….