బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 30: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు పూర్తిగా చేరాలంటే అధికార యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థల (NGOs) పాత్ర ఎంతో కీలకమని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
శుక్రవారం, హుజురాబాద్కు నూతనంగా వచ్చిన ఏసీపీ మాధవిని పీవీ సేవా సమితి ప్రతినిధులు, సిద్ధార్థ్ నగర్ సొసైటీ అధ్యక్షులు సాగి వీరభద్ర రావు ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఏసీపీ మాధవిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో పీవీ సేవా సమితి, సిద్ధార్థ్ నగర్ అధ్యక్షులు తూము వెంకట రెడ్డి, సాగి వీరభద్ర రావు, బి. మనోజ్, విశ్రాంత పీడీ రాజి రెడ్డి, మురికి గౌరీశంకర్, సీడ్స్ సంపత్ రావు, బిల్డర్ శ్రీనివాస్ రావు, ముక్కెర కన్నయ్య, దొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










