తెలంగాణ మంత్రివర్గంలో యాదవులకు సముచిత స్థానం కల్పించాలి. యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐల్లేష్ యాదవ్.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,మే 29:
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు సముచిత స్థానం కల్పించాలని యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల ఐల్లేష్ యాదవ్ కోరారు. మంత్రివర్గంలో యాదవులకు స్థానం లేకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్ర వారం హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గొర్ల ఐల్లేష్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో యాదవ జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ, వారికి రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని అన్నారు. యాదవుల ఆశయాలు, ఆకాంక్షలను మంత్రివర్గంలో ప్రతిబింబించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో యాదవ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు గొర్ల కొమురయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ యాదవ్, రాష్ట్ర నాయకులు మేకల అశోక్ యాదవ్, గేల్లు
మల్లయ్య యాదవ్, పులవేణి పోచమలు యాదవ్, కాసు అర్జున్ యాదవ్, భాష వేణి సమ్మయ్య యాదవ్, మండల సాయిబాబా యాదవ్, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వీరందరూ యాదవులకు మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !