బాహు బలంన్యూస్ హుజురాబాద్ మే 28: హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆర్య వైశ్య ముద్దు బిడ్డ, ప్రముఖ సంఘ సేవకులు శ్రీ కొమురవెల్లి హరి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం జరిగింది.
పట్టణ ఆర్య వైశ్య సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సంఘ నాయకులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన హరి ప్రసాద్ను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో సుద్ధాల హరి శంకర్, గర్రెపల్లి శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, నూక శ్రీనివాస్, శశిధర్, శివ తదితర ప్రముఖ ఆర్య వైశ్య నాయకులు పాల్గొని హరి ప్రసాద్కి శుభాకాంక్షలు తెలియజేశారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరి ప్రసాద్ సేవలు పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, వాకింగ్ అలవాటును ప్రోత్సహించడానికి దోహదపడతాయని ఆర్య వైశ్య సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.










