హుజురాబాద్, పోతిరెడ్డిపేటలో చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 28:
హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ పోతిరెడ్డిపేట ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన తండ్రి, తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు చందుపట్ల జనార్ధన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, ఆటలు యువతలో క్రమశిక్షణను, ఐకమత్యాన్ని పెంపొందించడంతోపాటు, శారీరక దృఢత్వాన్ని, మానసిక పరిపక్వతను అందించి, సమాజాభివృద్ధికి తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చందుపట్ల పరందాములు, ఉపసర్పంచ్ చందుపట్ల రాజేందర్, మంతెన సురేందర్, చందుపట్ల రాజీరు, మామిడి రమేష్, టీమ్ కెప్టెన్లు బొల్లే వేణి రాజు, బోళ్ల ప్రశాంత్, కంకణాల అంజి, తమ్మ ప్రదీప్, రాచర్ల సుమన్, బన్నీలతో పాటు గ్రామస్తులు మంతెన శ్రీనివాస్, జూపాక వెంకటేశ్వర్లు, కంకణాల అజయ్, తమ్మ రమేష్, గోగుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !