బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 26: అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (ఏఐఎఫ్డీఎస్) హుజురాబాద్ పట్టణ శాఖ నూతన కమిటీ నియామకం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా బత్తుల విష్ణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా బత్తుల విష్ణు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థుల హక్కుల సాధన, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఏఐఎఫ్డీఎస్ కృషి చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ఏఐఎఫ్డీఎస్ ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు వారు అభినందనలు తెలిపి, సంఘం లక్ష్యాల సాధనలో క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి లోకానికి, సమాజానికి మేలు చేసే కార్యక్రమాలను చేపట్టాలని వారు ఆకాంక్షించారు.










