రాజీవ్ యువ వికాసం రుణాలపై పేదల ఆశలు – ప్రెమన్న విజ్ఞప్తి

బాహు బలంన్యూస్ వరంగల్: ప్రతినిధి మే 25
రాజీవ్ యువ వికాసం పథకం కింద నిజమైన పేదలకు మాత్రమే రుణాలు అందేలా చూడాలని, ఈ విషయంలో పారదర్శకత పాటించాలని కోరుతూ ప్రేమన్న నేతృత్వంలోని యువ వికాసం సభ్యులు GWMC DCని కలిశారు. విలీన గ్రామాలలో ఒక్కో గ్రామానికి 300 యూనిట్లు అందించాలని వారు డిమాండ్ చేశారు.
గతంలో, 2019 నుండి 2023 సంవత్సరాల మధ్య కార్పొరేషన్లలో ఎవరైనా కుటుంబ సభ్యులు రుణం తీసుకున్నట్లయితే, వారికి మళ్ళీ రుణం ఇవ్వకుండా సెకండ్ లిస్ట్‌లో అవకాశం కల్పించాలని ప్రేమన్న విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారుల ఎంపికలో వయస్సు, విద్యార్హతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ విషయంపై ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ గారు కూడా ఆలోచించి, పేదలకు న్యాయం చేయాలని ప్రేమన్న కోరారు. ఈ కార్యక్రమంలో యువ వికాసం సభ్యులందరూ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !