హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్‌లో బాలల వేసవి శిక్షణ శిబిరంలో పౌష్టికాహార పంపిణీ.

బాహుబలం న్యూస్
bahubalamtv.in

హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్‌లో బాలల వేసవి శిక్షణ శిబిరంలో పౌష్టికాహార పంపిణీ.

17 May 2025, 3:43 pm BAHUBALAM NEWS

బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 17: స్థానిక హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో జరుగుతున్న బాలబాలికల వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులకు శనివారం నాగార్జున డెయిరీ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు.
నాగార్జున డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆకునూరి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అరటిపండ్లు మరియు కోడిగుడ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వాకర్స్ క్లబ్ సభ్యులు మరియు అధ్యక్షులు పాల్గొని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించినందుకు నాగార్జున డెయిరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు శిక్షణతో పాటు ఇలాంటి పౌష్టికాహారం అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏజీఎం ఆకునూరి సుధాకర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ నాగార్జున డెయిరీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Generating image…

బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 17: స్థానిక హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో జరుగుతున్న బాలబాలికల వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులకు శనివారం నాగార్జున డెయిరీ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు.
నాగార్జున డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆకునూరి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అరటిపండ్లు మరియు కోడిగుడ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వాకర్స్ క్లబ్ సభ్యులు మరియు అధ్యక్షులు పాల్గొని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించినందుకు నాగార్జున డెయిరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు శిక్షణతో పాటు ఇలాంటి పౌష్టికాహారం అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏజీఎం ఆకునూరి సుధాకర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ నాగార్జున డెయిరీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్‌లో బాలల వేసవి శిక్షణ శిబిరంలో పౌష్టికాహార పంపిణీ.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 17: స్థానిక హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో జరుగుతున్న బాలబాలికల వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులకు శనివారం నాగార్జున డెయిరీ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు.
నాగార్జున డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆకునూరి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అరటిపండ్లు మరియు కోడిగుడ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వాకర్స్ క్లబ్ సభ్యులు మరియు అధ్యక్షులు పాల్గొని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించినందుకు నాగార్జున డెయిరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు శిక్షణతో పాటు ఇలాంటి పౌష్టికాహారం అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏజీఎం ఆకునూరి సుధాకర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ నాగార్జున డెయిరీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..