365 రోజులు రుణాలివ్వాలి: ప్రేమన్న డిమాండ్

బాహు బలంన్యూస్ కరీంనగర్ ప్రతినిధి మే 13:అన్ని కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏడాది పొడవునా రుణాలు అందించాలని. తెలంగాణ పేదల రాజ్యాధికార సమితి (టీపీఆర్ఎస్ )రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమన్న డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా ప్రతిమ హోటల్‌లో జరిగిన కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఇంచార్జి కనకం ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి ఒకసారి మాత్రమే రుణాలు ఇచ్చి తీవ్ర అన్యాయం చేసిందని ప్రేమన్న ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలో బ్యాంకు అనుమతి ఇవ్వగానే సబ్సిడీ వచ్చి, బ్యాంకులు రుణం మంజూరు చేసే విధానాన్ని తిరిగి అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. ఈ విషయాన్ని అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలకు కలిసి వివరిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బోరాగాల సమ్మయ్య, మహిళా అధ్యక్షురాలు గొర్రె రమ, యూత్ అధ్యక్షులు గుమ్మడి ఆంజనేయులు, కానుకట్ల రిషి తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….