హుజురాబాద్, మే 10 (బాహు బలంన్యూస్): హుజురాబాద్ టౌన్ నూతన సీఐగా బదిలీపై వచ్చిన డి. కరుణాకర్ను తెలంగాణ బీసీ సిటిజన్ ఫోరం నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర నాయకులు చందుపట్ల జనార్ధన్, సందేల వెంకన్న మాట్లాడుతూ కరుణాకర్ రాక పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తూ, శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. జిల్లాలో ఆదర్శ సీఐగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. చట్టానికి అనుగుణంగా పనిచేస్తూ ప్రజల అభిమానాన్ని పొందాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయం మాజీ చైర్మన్ ఆకుల సదానందం, బీసీ నాయకులు ఉప్పు శ్రీనివాస్, బుడిగజంగాల నాయకులు సిరిపాటి వేణు, బొంగోని వెంకటయ్య, తాళ్లపల్లి అమరేందర్, గంగిశెట్టి జగదీశ్వర్, దాసరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Post Views: 232










