ఘనంగా సామాజిక కార్యకర్త రవీందర్ రావు వివాహ వార్షిక వేడుకలు.

బాహు బలం న్యూస్ హుజురాబాద్ ప్రతినిధి:

హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, ప్రముఖ వ్యాపారవేత్త, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వర్ధినేని రవీందర్ రావు – లక్ష్మీ దంపతుల 39వ వివాహ వార్షికోత్సవ వేడుకలు హుజురాబాద్ పట్టణంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ముందుగా హుజురాబాద్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వాకర్స్ నాయకులు గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు కేక్ కట్ చేసి రవీందర్ రావును శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హుజురాబాద్ క్లబ్ లో క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు రవీందర్రావుచే కేక్ కట్ చేసి, శాలువాలు కప్పి కేకులు స్వీట్లు తినిపించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సాయంత్రం ఆయన నివాసం వద్ద ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. రవీందర్ రావు లక్ష్మీ దంపతులు నిండా నూరేళ్లు అన్యోన్యంగా కలిసి జీవించి వివాహ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలలో రవీందర్ రావు అభిమానులు, బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి తదితర పార్టీలకు చెందిన నాయకులు వాకర్ నాయకులు, సభ్యులు, పలువురు వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !