కొంపముంచిన. కోటరీ.
నమ్ముకునన్న వారే నట్టేట ముంచారు
నరేందర్ రెడ్డి ఓటమిలో..
పీఏ, పీఆర్ ఓ
పక్కనే ఉంటూ పక్క వారికి మద్దతు
అండగా నిలవని పలువురు కాంగ్రెస్ నేతలు
‘హ్యాండ్’ ఇచ్చిన నాయకులు, కార్యకర్తలు చివరివరకూ పోరాడిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కంటతడి పెడుతూ కౌంటింగ్ కేం కేంద్రం నుంచి బయటకు..
సానుభూతి వ్యక్తంచేసిన మీడియా అభిమానులు.
బాహుబలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ మార్చి 06:
రౌండ్ రౌండూ నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరాటం. ఎక్కడా తగ్గకుండా ప్రత్యర్థి గుండెల్లో పరుగులు పెట్టించారు. చివరివరకూ అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. కానీ, చివరి నిమిషంలో ఓటమి తప్పలేదు అల్పోర్స్ నరేందర్ రెడ్డికి. అయితే ఆయన ఓడిపోయినప్పటికీ పట్టభద్రులు, అభిమానుల అభిమానాన్ని మాత్రం పెద్ద స్థాయిలో కూడగట్టారు. మరోవైపు నరేందర్ రెడ్డి నమ్ముకున్న కోటరీనే ఆయన ఓటమికి కారణమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నమ్ముకున్న వారే ఆయనను ఓటమి అంచుల్లోకి తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. పక్కనే ఉంటూ పక్కవారికి మద్దతు తెలిపారన్న ఆరోపణలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా నరేందర్ రెడ్డికి ‘హ్యాండ్’ ఇచ్చారని బహిరంగంగానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఆయనకు సపోర్టు చేయలేదన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు నరేందర్ రెడ్డి పేరు తెరపైకి రాగానే ఆయనపై వ్యతిరేకత వెలుగులోకి తెచ్చారు. విద్యా సంస్థలను నిర్వహించే క్రమంలో ఆయన వ్యవహార శైలిని ఎత్తి చూపుతూ విమర్శలు వచ్చాయి. దీంతో అటు వ్యతిరేకతను సానుకూలంగా మల్చుకుంటూ ఇటు పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగారు. కరీంనగర్ లో అసలు ఓట్లే రావన్న స్థాయిలో ప్రచారం జరిగినా ఆయన పోరాడారు. తొలి రౌండ్ నుండి అంచనాలకు తగ్గట్టుగా ఓట్లు రాబట్టుకోలేదన్న వేదన మాత్రం నరేందర్ రెడ్డిని వెంటాడింది. ఆయన ఊహించని విధంగా ఫలితాలు రావడంతో చివరకు కంటతడి పెట్టడం అందరినీ కలిచివేసింది.
ముంచిన పీఏ, పీఆర్ ఓ
మరోవైపు నరేందర్ రెడ్డి నమ్ముకున్న వారు హ్యాండ్ ఇచ్చినప్పటికీ చివరి వరకూ ఆయన పోరాడారు. రౌండ్ రౌండ్కు ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తూ వచ్చారు. ఏ రౌండ్లో ఎక్కడ లీడ్లోకి వస్తారేమోనన్న టెన్షన్ అందరిలోనూ కనిపించింది. అయితే కొన్ని రౌండ్లలో నరేందర్ రెడ్డి లీడ్లోకి రావడంతో వారి భయం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే.. మొదటి నుంచి కూడా నరేందర్ రెడ్డి ఒంటరిగా పోరాడుతూనే ఉన్నారు. ఎవరు మద్దతుగా ఉన్నా లేకున్నా వారియర్ లాగా ఉద్యమం సాగించారు. అలాగే ఆయన వెంట ఉన్న పీఏ, పీఆర్ సైతం నరేందర్ రెడ్డి ఓటమి పాలవ్వడానికి కీలక పాత్రులయ్యా రని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, లిఫ్ట్ చేసి మాట్లాడిన విషయాన్ని నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లకపోవడం, ఎవరినీ ఆయనను కలువనీయకుండా అడ్డుకోవడం వల్ల కూడా ఓటమికి ప్రధాన కారణంగా ప్రచారం జరుగుతోంది..










