జర్నలిస్టుల సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు… జర్నలిస్టుల నిరసనకు మద్దతు పలికిన బిఆర్ఎస్, బిజెపి, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు…

బాహుబలంన్యూస్ ప్రతినిధి హుజురాబాద్ జనవరి 29:
హుజురాబాద్ జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై మరో ఉద్యమం తప్పదని వివిధ పార్టీ నాయకులతో పాటు ప్రజాసంఘాలు హెచ్చరించాయి. మా ఇల్లు మాకు కావాలంటూ హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు బుధవారం మూడవ రోజుకు చేరుకున్నాయి. నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రెస్ క్లబ్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ హుజూరాబాద్ లోని ప్రధాన వీధుల గుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అంబెడ్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అంబేద్కర్ కూడలిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కళాకారులు ఆటపాట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ… గత 20 సంవత్సరాలుగా జర్నలిస్టులు ఎంతో కష్టపడి సాధించుకున్న నివేషణ స్థలాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తో పాటు మంత్రి పొన్న ప్రభాకర్ వెంటనే చొరవ చూపి వారికి పూర్తిస్థాయిలో ఇల్లు కట్టించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు వారికి అండగా ఉంటామని, వారితోపాటు కలిసి నిరసనలో పాల్గొంటామని అన్నారు. జర్నలిస్టుల సమస్యపై ప్రభుత్వం కాలయాపన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని హెచ్చరించారు. జర్నలిస్టుల నిరసనకు బిఆర్ఎస్, బిజెపి వామపక్ష పార్టీలు సిపిఐ, సీపీఎం లతోపాటు ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. అనంతరం కేసి క్యాంపు కు బైకు ర్యాలీ ద్వారా వెళ్లి ఆర్డిఓ ఏఓ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది .ఈ నిరసన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్ లు కాయిత రాములు,నిమ్మటూరి సాయి కృష్ణ,మాజీ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక, బిఆర్ఎస్ నాయకుడు గందే శ్రీనివాస్, బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు , ప్రజాసంఘాల నాయకులు వేల్పుల రత్నం, సందుపట్ల జనార్ధన్, పొడిశేట్టి వెంకటరాజం, మార్త రవీందర్ ,విష్ణు దాస్ గోపాలరావు, బత్తుల మనోజ్ తోపాటు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. శనిగరపు బాబ్జి కళాబృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !