KSS ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల పిల్లలకు ఆట వస్తువుల పంపిణీ ..

బహుబలం న్యూస్ ప్రతినిధి తాడువాయి నవంబర్17: ఆదివారం రోజున సమ్మక్క సారలమ్మ తాడువాయి మండలంలోని ఊరటం గ్రామంలో గల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కె ఎస్ ఎస్ ఫౌండేషన్ హైదరాబాద్ సౌజన్యంతో ఆటవస్తుల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ చైర్మన్ కోల సందీప్ తో పాటు ఎటూర్ నాగారం మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్యలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్య మాట్లాడుతూ చదువుకునే ప్రాయంలో పిల్లలకు చదువుతోపాటు వ్యాయామ విద్య వ్యాయామము ఎంతో అవసరమని చెప్పారు ప్రతిరోజు ఉదయం వ్యాయమం చేయడం ద్వారా శరీరం యాక్టివ్ గా ఉండడంతో పాటు మన మెదడు కూడా యాక్టివ్ గా పనిచేస్తుందని తెలియజేశారు కాబట్టి బాలికలంతా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యాయమం చేయడం తమ జీవితంలో భాగంగా ఉండాలని తెలియజేశారు అదేవిధంగా ఈ సందర్భంగా కె ఎస్ ఎస్ ఫౌండేషన్ చైర్మన్ కోల సందీప్ గారు మాట్లాడుతూ నా యొక్క తండ్రి గారైన కోల సైదులు గారి యొక్క కోరిక మేరకు మా నాన్నగారు కష్టించి సంపాదించిన దానిలో నుండి కొంత భాగం నా పేద ప్రజల కోసం ఖర్చు చేయాలని మా నాన్నగారి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమాలు మా కే ఎస్ ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈరోజు అత్యంత మారుమూల ప్రాంతమైన ఈ ఊరటంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ ఆట వస్తువులను పంపిణీ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలగజేస్తుందని తెలియజేశారు నేను ఇటువంటి కార్యక్రమాలు మునుముందు చేయడానికి మీరు మీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కె ఎస్ ఎస్ ఫౌండేషన్ చైర్మన్ తండ్రిగారైన కోలా సైదులు మరియు కన్నాయిగూడెం సోషల్ మీడియా ఇంచార్జి కావిరి అంజన్ రావు తడవాయి మండల టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు మహ్మద్ రఫీ,సర్ప,రవీందర్,మైపతి సంతోష్ గారు ముదురుకోళ్ల చందు జనగాం కిరణ్ గారు మరియు ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు క్యారం బోర్డులు రెండు వాలీబాల్ 20 షటిల్ బ్యాట్స్ 20 రింగ్స్ 50 స్కిప్పింగ్ రూల్స్ రెండు చెస్ బోర్డులు మరియు పాఠశాలకు సరిపోవు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..