నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు ఘనంగా సన్మానం..

బహుబలం న్యూస్ ప్రతినిధి.
హుజురాబాద్ నవంబర్ 16 :హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గంలో కాట్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు డైరెక్టర్ గా నియామక మైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోమటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా,పార్టీ కష్టకాలంలో ఉన్న వ్యక్తుల గుర్తించి పార్టీలో తగిన గుర్తింపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబుకి శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.హుజు రాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ రైతులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని, రైతు పక్షపాతి ప్రభుత్వం అయినా కాంగ్రెస్ పార్టీ విధివిధానాలను విస్మరించకుండా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !