సబ్బనీ వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి,(హుజురాబాద్)
కరీంనగర్: త్వరలో జరిగే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రధానఅనుచరులు,అభిమానులు గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.సుమారు వంద మంది బృందాలుగా ఏర్పడి ఎమ్మెల్సీ పరిధిలోని కరీంనగర్,నిజామా బాద్,ఆదిలాబాద్,మెదక్ జిల్లాలలోని పట్టణాలతో పాటు మారుమూల ప్రాంతాలలో తిరుగుతూ నరేందర్ రెడ్డి పేరును విస్తరింపజేస్తూ చాపకింద నీరులా ప్రచారాలు చేపడుతున్నా రు.పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కల్పిస్తూ ఎన్ రోల్ మెంట్ పత్రాలను అందజేస్తు న్నారు.నిరుద్యోగుల సమస్య ల పరిష్కారం కోసం,విద్యార్ధుల కు ఉన్నత విద్యా అవకా శాలు కల్పించడం కోసం నిరంరతం కృషి చేసే సత్తా కలిగి న నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మేధావులను,పట్టభద్రులను కోరుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రచారం ఊపందు కోగా మరో వైపు అతని అనుచరులు,అభిమానులు ప్రత్యర్థి అభ్యర్ధులకు అంతుచిక్కని విధంగా ప్రచార కార్యక్రమాల ను కొనసాగిస్తున్నారు.దాదాపు లక్ష మందికి పైగా కొత్తగా ఓటరు గా నమోదు చేసుకోవడానికి ఎన్రోల్మెంట్ పత్రాలను అందించినట్లు తెలుస్తోంది.ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు మేము సైతం అంటూ పనిచేయడానికి యువ సైన్యాలు ముందుకు వస్తున్నాయి.దీంతో నాలుగు జిల్లాల్లో నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రచారం జోరందుకుంటుంది











