ఏకలవ్య కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చెయ్యాలి. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు.

బాహు బలం న్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 24:
ప్రభుత్వం వెంటనే ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసీ బడ్జెట్ ను కేటాయించాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం హుజురాబాద్ పట్టణం లో జిల్లా అధ్యక్షులు కూతాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు హాజరై మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో ఎస్టీల వర్గీకరణ చేపట్టే ముందు విద్యా ఉద్యోగ ఉపాధి ఆర్దిక, సామాజిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందని తెగల ను గుర్తించి ఎస్టీలో ఏ బి సి డి వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వా నికి డిమాండ్ చేశారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వే షన్లు వర్గీకరణ తీర్పును గౌరవించి ఎస్టీ వర్గీకరణ ప్రభు త్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.ఏబిసిడి వర్గీకరణ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్రిమిలేయర్ పరిగణంలోకి తీసుకోవద్దని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం వెంటనే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ఏబిసిడి వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో దాదాపుగా 8 లక్షల జనాభా కలిగి ఉండి విద్యా ఉద్యోగ ఉపాధి ఆర్దికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నా మని ప్రభుత్వానికి గుర్తు చేశారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ప్రత్యేక ఏకల వ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవసరమైన బడ్జెట్ ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎరుకల కార్పొరేషన్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసి ఎరుక ల కుటుంబాలు కులవృత్తితో పాటు విద్య ఉద్యోగ ఉపాధి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ప్రభుత్వా నికి గుర్తు చేశారు.సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న గిరిజన మంత్రిత్వ శాఖతో ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు కలవాలంటే తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంద ని,ఆ ప్రత్యేక శాఖకు మంత్రినీ కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో కేటాయించాలని తెలంగా ణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనేటి రాజు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవెల్లి రాజలింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాడు శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు బండి సమ్మయ్య,జిల్లా ఉపాధ్యక్షులు కూతాడి కుమార్, మానుపాటి మల్లేశం,జిల్లా నాయకులు మొగిలి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….