అక్రిడిటేషన్ల జారీలో చిన్నపత్రికల విభజన చెల్లదు: హైకోర్టు .

అక్రిడిటేషన్ల జారీలో చిన్నపత్రికల విభజన చెల్లదు: హైకోర్టు .

బాహు బలం న్యూస్,హైదరాబాద్ ఆగస్టు 06: పత్రికల్లో పనిచేసే వారికి ప్రభుత్వ గుర్తింపు (అక్రిడిటేషన్) కార్డుల జారీలో చిన్న పత్రికలను ఎ, బి, సి, డిలుగా విభజించడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది.దీనికి సంబంధించి జీవో 239 షెడ్యూలు-ఇలోని నిబంధలను కొట్టివేసింది. అక్రిడిటేషన్ కు సంబంధించి 2016లో జారీచేసిన జీవోలోని నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయని, వాటిని కొట్టి వేయాలంటూ మహబూబ్ నగర్ కు చెందిన టి.కృష్ణ మరో ముగ్గురు 2016లో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధ నల వల్ల చిన్నపత్రికల్లో పనిచేసే జిల్లా,నిబంధనల వల్ల చిన్న పత్రికల్లో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ప్రయోజ నాలు లభించడంలేదన్నారు.వాదనలు విన్న ధర్మాసనం చిన్న పత్రికలను విభజించడానికి ప్రభుత్వం సహేతుక కారణాలను పేర్కొన లేదని,ఆ నిబంధనలు చెల్లవని స్పష్టం చేసింది.రెండు నెలల్లో చిన్న పత్రికల జిల్లా, నియోజ కవర్గ విలేకరులకు ప్రయోజనం కలిగించేలా మార్గదర్శకా లు రూపొందించాలని ఆదేశించింది.

Share ePaper Clip

Preparing image...

బాహు బలం న్యూస్,హైదరాబాద్ ఆగస్టు 06: పత్రికల్లో పనిచేసే వారికి ప్రభుత్వ గుర్తింపు (అక్రిడిటేషన్) కార్డుల జారీలో చిన్న పత్రికలను ఎ, బి, సి, డిలుగా విభజించడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది.దీనికి సంబంధించి జీవో 239 షెడ్యూలు-ఇలోని నిబంధలను కొట్టివేసింది. అక్రిడిటేషన్ కు సంబంధించి 2016లో జారీచేసిన జీవోలోని నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయని, వాటిని కొట్టి వేయాలంటూ మహబూబ్ నగర్ కు చెందిన టి.కృష్ణ మరో ముగ్గురు 2016లో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధ నల వల్ల చిన్నపత్రికల్లో పనిచేసే జిల్లా,నిబంధనల వల్ల చిన్న పత్రికల్లో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ప్రయోజ నాలు లభించడంలేదన్నారు.వాదనలు విన్న ధర్మాసనం చిన్న పత్రికలను విభజించడానికి ప్రభుత్వం సహేతుక కారణాలను పేర్కొన లేదని,ఆ నిబంధనలు చెల్లవని స్పష్టం చేసింది.రెండు నెలల్లో చిన్న పత్రికల జిల్లా, నియోజ కవర్గ విలేకరులకు ప్రయోజనం కలిగించేలా మార్గదర్శకా లు రూపొందించాలని ఆదేశించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !