అక్రిడిటేషన్ల జారీలో చిన్నపత్రికల విభజన చెల్లదు: హైకోర్టు .

బాహు బలం న్యూస్,హైదరాబాద్ ఆగస్టు 06: పత్రికల్లో పనిచేసే వారికి ప్రభుత్వ గుర్తింపు (అక్రిడిటేషన్) కార్డుల జారీలో చిన్న పత్రికలను ఎ, బి, సి, డిలుగా విభజించడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది.దీనికి సంబంధించి జీవో 239 షెడ్యూలు-ఇలోని నిబంధలను కొట్టివేసింది. అక్రిడిటేషన్ కు సంబంధించి 2016లో జారీచేసిన జీవోలోని నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయని, వాటిని కొట్టి వేయాలంటూ మహబూబ్ నగర్ కు చెందిన టి.కృష్ణ మరో ముగ్గురు 2016లో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధ నల వల్ల చిన్నపత్రికల్లో పనిచేసే జిల్లా,నిబంధనల వల్ల చిన్న పత్రికల్లో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ప్రయోజ నాలు లభించడంలేదన్నారు.వాదనలు విన్న ధర్మాసనం చిన్న పత్రికలను విభజించడానికి ప్రభుత్వం సహేతుక కారణాలను పేర్కొన లేదని,ఆ నిబంధనలు చెల్లవని స్పష్టం చేసింది.రెండు నెలల్లో చిన్న పత్రికల జిల్లా, నియోజ కవర్గ విలేకరులకు ప్రయోజనం కలిగించేలా మార్గదర్శకా లు రూపొందించాలని ఆదేశించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…