చట్ట పరిధిలోనే ప్రశాంతమైన జీవితం. మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు సత్యంగౌడ్.

బాహు బలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 06:
చట్ట పరిధిలో మెదులుతేనే ప్రశాంతమైన జీవితం గడపవచ్చునని ప్రజాకవి, రచయిత, మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు తత్వవేత్త బ్రహ్మశ్రీ ఆధ్యా త్మిక గురువు నాగుల సత్యం గౌడ్ పేర్కొన్నారు. ఇటీవల హుజురాబాద్ పట్టణ సీఐగా జి. తిరుమల్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా తన కార్యాల యం లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి,పోలీస్ కవిత జ్ఞాపకను అందజేసి, తిరుమల్ గౌడ్ ను పట్టు శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజాకవి సత్యం గౌడ్,మాట్లాడుతూ పోలీస్ వృత్తిని దైవంగా భావిస్తూ,వృత్తి ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తూ,తన దగ్గరికి బాధితులు ఎవరు వచ్చినా వారికి సంపూర్ణ న్యాయం చేస్తూ, తనవం తు పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ వివిధ గ్రామాల లో ప్రజాసేవలనే ఆదర్శప్రాయంగా వివరించి చెపుతున్న సీఐ తిరుమల గౌడ్ ఆదర్శప్రాయం అన్నారు.ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి నిర్వచనంగా నిలిచి, చిన్న,పెద్ద అనే భేదం లేకుండ, అందరితో కలిసి మెలిసి ఉంటూ,ప్రజలందరి మనసుల్లో మంచి వ్యక్తిగా చోటు చేసుకునెల తన బాధ్యత ను నిర్వహిస్తున్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు పోలీసులకు సహకరిస్తూ, ప్రతి ఒక్కరూ చట్ట పరిధిలో మెదిలి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు మనం ఏర్పర్చుకున్న విలువల్ని కాపాడుకుంటూ,విలువైన పౌరులుగా ఎదగాలనారన్నారు. అనంతరం సత్యం గౌడ్ రచించిన చట్టాలు,సన్మార్గానికి చుట్టాలు అనే కవిత సంక లనాన్ని సిఐ తిరుమల్ గౌడ్ఆవిష్కరించారు. సత్యం గౌడ్ తో పాటు హుజురాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయకుమార్ అలియాస్ బ్రహ్మచారి, కౌన్సిలర్ ఇమ్రా న్,ఫేస్బుక్ సోషల్ మీడియా కరీంనగర్ జిల్లా కన్వీనర్ లక్షణమూర్తి తులసి తదితరులు శుభాకాంక్షలు తెలియ జేశారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….