సబ్బనివెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్
ఆగస్టు 02:
ఎస్సీ కులాలను కుల గణన చేసిన అనంతరమే వర్గీకరణ అమలు చేయాలని ఎస్సీ ఉపకులాల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు డిమాండ్ చేశారు . ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తూ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఉప కులాలు 2011 జనాభా లెక్కల ప్రకారం 30 లక్షల వరకు ఉంటారని ,ప్రస్తుత జనాభా రెట్టింపు అవుతుందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎస్సీ కులాల ను వర్గీకరణ చేస్తే ఉపకులాలు నష్టపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎస్సి వర్గీకరణ పలాలు ఉప కులాలకు అందాలంటే తక్షణమే కుల గణన చేయాలని కోరారు.అలాగే అంబేద్కర్ అభయాస్తం లో భాగంగా ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించి ఉప కులాల కార్పొరేషన్ ను విస్మరించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉప కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా బైరి వెంకటేశంను నియమించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో కానుకూర్తి రాజేష్, తూర్పాటి లింగయ్య, చింతల అంజి, చింతల సతీష్ వర్మ, చంద్ర గిరి సందీప్, తూర్పాటి రాజు, తూర్పాటి రామచంద్రం, రేవెల్లి వెంకటేష్ , వానరాశి జాన్, తూర్పాటి సాయికుమార్, గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.










